యాప్నగరం

ప్రేమ పేరుతో తొమ్మిది విద్యార్థిపై అత్యాచారం.. ఆమె చెల్లిలిపైనా, హైదరాబాద్‌లో దారుణం

Hyderabad నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిది, ఏడు తరగతి విద్యార్థులపై ఐదుగురు అత్యాచారం చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు.

Samayam Telugu 18 Mar 2020, 7:07 pm
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కమాటిపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురు మైనర్ బాలురు కాగా.. ఇద్దరు యువకులు ఉన్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ పేరుతో తొమ్మిదో తరగతి విద్యార్థిని శారీరకంగా లోబరుచుకొని దారుణానికి ఒడిగట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత ఆమెను, ఆమె చెల్లెలిని బెదిరించి స్నేహితులతో కలిసి పలుమార్లు వారిద్దరిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
Samayam Telugu rape


తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతొ ప్రలోభ పెట్టాడు. ఆ తర్వాత ఆమెను లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. ఆ విషయాన్ని స్కూల్లో, బస్తీలో ఇతరులకు చెబుతానంటూ అమ్మాయిని బెదిరించి ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

Must Read: కరోనాపై ఫేక్ వార్తలు.. వాట్సాప్ అడ్మిన్, మరో ఇద్దరి అరెస్ట్

నిందితుడి ద్వారా విషయం తెలుసుకున్న మరో నలుగురు యువకులు కూడా బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత 7వ తరగతి చదువుతున్న ఆమె చెల్లెలిని కూడా లైంగికంగా వేధించినట్లు, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడ్డ ఐదుగురిని అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

Also Read: హనీమూన్ వెళ్లొచ్చిన యువతికి కరోనా.. ఇంట్లో దాచిన తండ్రిపై కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.