యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం.. దొంగ అనుకొని కొట్టి చంపేశారు

కొత్తగా అనిపించడంతో పొరపాటున పక్కనే ఉన్న అపార్టమెంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వాచ్ మెన్ దొంగ అనుకొని కర్రతో తలమీద కొట్టాడు. ఆ తర్వాత అందర్నీ పిలిచాడు.

Samayam Telugu 16 Sep 2020, 7:55 am
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగ అనుకొని ఓ వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. దీంతో అతడు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటన బాచుపల్లి పీఎస్‌ పరిధి ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న అభి వెంచర్‌లో పని చేయడానికి మేస్త్రీల బృందం సోమవారం ఒడిశా నుంచి వచ్చింది. తెలవారుజామున 4 గంటల సమయంలో లక్ష్మణ్‌ జా (48) అనే మేస్త్రీ అభి వెంచర్‌కు ఆనుకొని ఉన్న మరో నూతనంగా నిర్మిస్తున్న జ్యోత్స్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు.
Samayam Telugu దొంగ అని చావగొట్టారు
beating


Read More: గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నకు ఎమ్మెల్సీ ?

అలికిడి కావడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నర్సింహ మేలుకున్నాడు. లక్ష్మణ్‌ను చూసి దొంగ వచ్చాడని భావించాడు. కర్రతో లక్ష్మణ్‌ తలపై కొట్టి తాడుతో బంధించాడు. వాచ్‌మన్‌ చుట్టుపక్కల వారికి సమాచారాన్ని అందించి మరోసారి కొట్టడంతో లక్ష్మణ్‌ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమించడంతో చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మణ్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.