యాప్నగరం

‘రేవంత్ తప్పు చేశారు.. వారికి క్షమాపణలు చెప్పాలి’

Gopanpalli land Issue: క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందో.. టీఆర్ఎస్ పార్టీ తిరుగుతుందో ప్రజలకు తెలుసని సుమన్ అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

Samayam Telugu 1 Mar 2020, 7:16 pm
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గోపన్ పల్లి భూ వివాదంపై తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. ఆ భూవివాదం నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు వెల్లడవుతోందని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పి వాళ్ల భూమి బాధితులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. గోపన్‌పల్లి భూ వివాదం ఈ మధ్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి సహజమేనని ఖండించారు. సీఎం కేసీఆర్‌కు ఎక్కడో కాలుతోందని, అందుకే తనపై ఈ విమర్శలని రేవంత్ విమర్శలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ స్పందించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu Balka_Suman


ఆయనవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు
క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందో.. టీఆర్ఎస్ పార్టీ తిరుగుతుందో ప్రజలకు తెలుసని సుమన్ అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రైతులందరు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం బాధల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలే అని బాల్కసుమన్ కొట్టి పారేశారు.

Must Read: కలర్ ఫుల్‌గా మారుతున్న హైదరాబాద్.. కారణమదేనా..

‘ఏడాది కాలంగా ఎన్నిక ఏదైనా తీర్పు ఏక పక్షంగా ఉంటూ వస్తోంది. సామాజిక సమతూకంతో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. దేశంలో ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు టీఆర్ఎస్ అదర్శంగా నిలుస్తోంది. గతంలో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుంది. సహకార సంఘాల్లో 95 శాతం వరకు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం కేటీఆర్ కృషి ఫలితమే.’’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు.

Must Read: ఐస్ క్రీం తిన్నారు.. వెంటనే నోట్లో నుంచి ధార కట్టిన రక్తం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.