యాప్నగరం

ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Road Accident: మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్వయంగా ఎమ్మెల్యే తన వాహనంలో హాస్పిటల్‌కి తరలించారు.

Samayam Telugu 25 Apr 2020, 4:49 pm
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బయ్యారం మండలంలో లాక్ డౌన్ విధించడం వల్ల పేదలను పరామర్శించి, వారికి నిత్యావసరాలు పంపిణీ చేసి ఎమ్మెల్యే వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బయ్యారం మండలంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ముగిశాక సమీపంలోని మరో గ్రామం మిర్యాలపెంటకు వెళ్తుండగా, మరో కారు వచ్చి అతి వేగంతో వచ్చి ముందున్న పోలీసు వాహనాన్ని ఢీకొంది.
Samayam Telugu mla


అదే వేగంతో వెనక ఎమ్మెల్యే ఉన్న కారు వద్దకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కారును పక్కకు తిప్పాడు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ క్షేమంగా బయటపడ్డారు. ఆ కారు పోలీసులు ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో అందులోని సీఐ రమేశ్, పోలీస్ కానిస్టేబుల్ రామకృష్ణ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వెంటనే ఆ ఇద్దరిని స్వయంగా తన వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.