యాప్నగరం

మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి.. లేకుంటే.. ఎమ్మెల్యే మండిపాటు

Sangareddy MLA: తెలంగాణలో జరగరానిది ఏమైనా జరిగితే అందుకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మంత్రి తలసాని ఏ రోజు సంగారెడ్డికి వచ్చినా అడ్డుకుంటామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Samayam Telugu 8 May 2020, 10:08 pm
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలున్నా, ప్రజలు ఇబ్బంది పడినా, అధిష్ఠానం నిర్ణయం మేరకు తాము సహకరిస్తూనే వచ్చామని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలంతా డమ్మీలేనని ఆరోపించారు. కరోనా వేళ తాము రాజకీయంగా ఎక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని చెప్పారు. దేశం కోసం పని చేసిన వ్యక్తి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని అవమానపరిచేట్లు మాట్లాడిన మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.
Samayam Telugu జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)


తెలంగాణలో జరగరానిది ఏమైనా జరిగితే అందుకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మంత్రి తలసాని ఏ రోజు సంగారెడ్డికి వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్‌ బట్టలు ఊడదీసి కొడతానని చెప్పిన తలసాని.. ఇప్పుడు కేసీఆర్‌కు భజన చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. మంత్రులు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉత్తమ్‌ పరిశీలించారు. రాష్ట్రంలో ఇంతవరకు 25 శాతమైనా ధాన్యం కొనుగోలు చేయలేదని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.