యాప్నగరం

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భార్య సహా నలుగురు సిబ్బందికి కరోనా

Telangana Coronavirus: శనివారం ఉదయం ఎమ్మెల్యే భార్య పద్మలతా రెడ్డి ఓ వాట్సప్ సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

Samayam Telugu 13 Jun 2020, 9:15 pm
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌ సోకడంతో ఆయన ఇంట్లోని వారందరికీ అధికారులు సూచనల మేరకు కరోనా టెస్టులు చేశారు. అయితే వాటి ఫలితాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎమ్మెల్యే సతీమణి పద్మలతా రెడ్డితోపాటు ఎమ్మెల్యే డ్రైవర్, గన్ మెన్, వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
Samayam Telugu ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
Muthireddy yadagiri reddy


దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భార్య పద్మలతా రెడ్డి.. తమకు కరోనా పాజిటివ్ అని తేలినా ఆరోగ్యంగానే ఉన్నామని ఫోన్‌లో చెప్పారు. పాజిటివ్ వచ్చిన నలుగురిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. జనగామ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సతీమణి కోరారు.

Also Read: undefined

శనివారం ఉదయం ఎమ్మెల్యే భార్య పద్మలతా రెడ్డి ఓ వాట్సప్ సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. మరో వారం రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు.

Also Read: undefined

Also Read: క్వారంటైన్ నుంచి యువకులు జంప్.. గర్ల్‌ఫ్రెండ్స్‌తో జల్సాలు.. ఆపై అదిరే ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.