యాప్నగరం

ఎమ్మెల్యేకు చుక్కలు చూపిన ప్రజలు.. నడి రోడ్డుపై నిలబెట్టి.. వీడియో

Malkajgiri: మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతు రావు రోడ్డుపై ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు అతనితో వాదనకు దిగారు. రోడ్లు సరిగా లేక అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను హనుమంత్ రావుకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 22 Nov 2020, 3:56 pm
మేడ్చల్‌లోని యాప్రాల్‌లో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేకు ఓటర్లు చుక్కలు చూపించారు. అంతేకాకుండా ఆయన చేత హామీ పత్రాన్ని రాయించి దానిపై సంతకం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సందర్భంగా నాయకులు ప్రచారం కోసం వాడ వాడలా, వీధివీధి తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లాలో జనాలు రోడ్ల నిర్మాణం కోసం రోడ్డు ఎక్కారు. అదే సమయంలో ఓట్ల కోసం మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతు రావు రోడ్డుపై ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు అతనితో వాదనకు దిగారు. రోడ్లు సరిగా లేక అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను హనుమంత్ రావు వివరించి చెప్పారు.
Samayam Telugu మైనంపల్లి హనుమంతు రావు
mynampally hanumantha rao


అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకుండా నిలదీశారు. ఓటర్లు అందరూ నో రోడ్స్.. నో ఓట్స్ ప్లకార్డులతో 2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే హనుమంతురావు ఎలక్షన్స్ పూర్తి కాగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. తన లెటర్ ప్యాడ్ పైన సంతకం చేసి నెత్తిన చేయి వేసుకొని ఓటర్లకి ప్రమాణం చేశాడు. సొంత నిధులు అవసరం లేదని, తామంతా జీహెచ్ఎంసీకి టాక్స్ కడుతున్నామని, వాళ్లే మాకు రోడ్లు వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.