యాప్నగరం

'AP BRS అధ్యక్షుడికి హైదరాబాద్‌లో రూ.4 వేల కోట్ల విలువైన భూములు'

Raghunandan Rao: ఏపీ బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ (Thota chandrasekhar)కు రూ. 4 వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ కట్టబెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆ భూములు కేటాయించారన్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 17 Jan 2023, 2:11 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిపై రఘనందన్ సంచలన వ్యాఖ్యలు
  • రూ.4 వేల కోట్ల మియాపూర్ భూమలుు కొట్టేశారని ఆరోపణ
  • మాజీ సీఎస్ సోమశ్ కుమార్ కనుసన్నల్లో జరిగిందని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Thota chandrasekhar
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు
Raghunandan Rao: ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ (Thota chandrasekhar)పై బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు హైదరాబాద్ మియాపూర్‌లో రూ. 4 వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లనే మియాపూర్ భూ కుంభకోణం జరిగిందన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
"రూ.4 వేల కోట్ల రూపాయల మియాపూర్ భూములను తోట చంద్రశేఖర్‌కు కేసీఆర్ అప్పగించారని ఆరోపణలున్నాయి సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగింది. ఉద్యమంలో రాక్షసులైన ఆంద్రోళ్లు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలి ? తోట చంద్రశేఖర్‌కు 40 ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉంది. సుఖేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోట చంద్రశేఖర్ విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు.

సర్వే నంబర్ 78లో జరుగుతున్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం.8 ఎకరాలకు ఒక న్యాయం, 40 ఎకరాలకు ఒక న్యాయమా ?. మియాపూర్ భూముల రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలి. సర్వే 78 లో 40 ఎకరాల భూములను తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారు. బిహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కవ. అందులో భాగంగానే బిహార్‌కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారు. గతంలో దొంగలుగా కన్పించిన ఆంధ్ర వాళ్ళు.‌‌. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుగా మారిపోయారు. చెప్పు చేతల్లో పెట్టుకునేందుకే.. డైరెక్ట్‌గా రిక్రూట్ అయినవారిని కాకుండా.. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమిస్తున్నారు." అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.