యాప్నగరం

Telangana BJP: బండి సంజయ్ తీరుపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి..!?

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ 23 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయగా.. తను సూచించిన వ్యక్తులను పక్కనబెట్టారంటూ రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Samayam Telugu 3 Aug 2020, 5:04 pm
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. 23 మందితో కూడిన రాష్ట్ర కమిటీని బండి సంజయ్ ప్రకటించగా.. తన సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఆయన బండి సంజయ్‌కు వాట్సప్ చేశారు. గ్రూప్ రాజకీయాలు వద్దని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సంజయ్‌కు సూచించారని సమాచారం.
Samayam Telugu bjp


తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా బండి సంజయ్ తనదైన టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ కోసం కష్టపడతారని భావించిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ సూచనలను సైతం ఆయన పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సీనియర్లలో ఉందని సమాచారం. చాలా మంది నేతలు సైలెంట్‌గా ఉండిపోగా... రాజా సింగ్ మాత్రం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆగష్టు 2న 23 మందితో కూడిన బీజేపీ రాష్ట్ర కమిటిని బండి సంజయ్ ప్రకటించారు. ఈ కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటీలో చోటు లభించింది. విజయరామారావు, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెండల లక్ష్మీనారాయణ, చింతల రామచంద్రారెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.