మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు రాత్రికి రాత్రే రంగులు మార్చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మణుగూరులో బుధవారం కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడో టీచర్గా పని చేసుకుంటున్న రేగా కాంతారావును కాంగ్రెస్ పార్టీ తల్లిలాగా ఎమ్మెల్యేను చేస్తే, ఆయన పార్టీ ఫిరాయించడమే కాకుండా ఆ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా? అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ద్రోహి అని అభివర్ణించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే రేగా కాంతారావు అక్రమంగా కబ్జా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం మణుగూరుకు వెళ్లింది. ఈ బృందం ఖమ్మంలో ఉదయం 9 గంటలకు బయలుదేరినప్పటి నుంచి పోలీసులు నిఘా ఉంచారు. తల్లాడ, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం క్రాస్ రోడ్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా వారిని ఆపుతూ నిలువరించే ప్రయత్నం చేశారు. మణుగూరులో అధిక సంఖ్యలో పోలీసులను మొహరించారు.
నేనేమీ చేయలేను: మునిసిపల్ కమిషనర్
అయితే, ఈ వ్యవహారంపై మణుగూరు మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. తన మీద రాజకీయపరమైన ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని, రికార్డులు తన వద్ద లేవని వ్యాఖ్యానించారు. గతంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారని, ఇప్పుడు తానేం చేయలేనని అన్నారు. అవసరమైతే మరో చోటకు బదిలీ చేయించుకుంటానని, లేదంటే సెలవుపై వెళ్లిపోతానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే రేగా కాంతారావు అక్రమంగా కబ్జా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం మణుగూరుకు వెళ్లింది. ఈ బృందం ఖమ్మంలో ఉదయం 9 గంటలకు బయలుదేరినప్పటి నుంచి పోలీసులు నిఘా ఉంచారు. తల్లాడ, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం క్రాస్ రోడ్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా వారిని ఆపుతూ నిలువరించే ప్రయత్నం చేశారు. మణుగూరులో అధిక సంఖ్యలో పోలీసులను మొహరించారు.
నేనేమీ చేయలేను: మునిసిపల్ కమిషనర్
అయితే, ఈ వ్యవహారంపై మణుగూరు మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. తన మీద రాజకీయపరమైన ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని, రికార్డులు తన వద్ద లేవని వ్యాఖ్యానించారు. గతంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారని, ఇప్పుడు తానేం చేయలేనని అన్నారు. అవసరమైతే మరో చోటకు బదిలీ చేయించుకుంటానని, లేదంటే సెలవుపై వెళ్లిపోతానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.