యాప్నగరం

కరోనా మరణాలు: లాజిక్‌తో కొట్టిన ఎమ్మెల్యే సీతక్క.. సంచలన వీడియో బయటికి..

ESI Hospital: కరోనా మరణాల సంఖ్య తప్పని విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానశారి అనసూయ (సీతక్క) చేసిన ట్వీట్, ఫేస్‌బుక్ సంచలనం రేపుతోంది.

Samayam Telugu 22 Jul 2020, 11:35 pm
తెలంగాణలో కరోనా బారిన పడ్డవారు, మరణించిన వారి విషయంలో ప్రభుత్వం లెక్కలు తప్పుగా చూపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ సహా, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై రోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి సంఖ్యను యథాతథంగా ప్రకటించకుండా తగ్గించి చూపుతున్నారని అంటున్నారు. అయితే, దీనిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు దీటుగా జవాబిస్తున్నారు. కరోనా మరణాల సంఖ్య దాస్తే దాగి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానశారి అనసూయ (సీతక్క) చేసిన ట్వీట్, ఫేస్‌బుక్ సంచలనం రేపుతోంది.
Samayam Telugu కరోనా మరణాలు: లాజిక్‌తో కొట్టిన ఎమ్మెల్యే సీతక్క.. సంచలన వీడియో పోస్ట్
mla seethakka


Must Read: undefined

కరోనా లెక్కల విషయంలో తేడాలున్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఓ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్‌లలో పోస్ట్ చేశారు. అందులో ఓ శ్మశానంలో పదుల సంఖ్యలో కాష్ఠాలు కాలుతున్నాయి. అది రాత్రి సమయం కావడం గమనార్హం. అక్కడే అంబులెన్స్, శ్మశాన సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. అయితే, జూన్ 21న ప్రభుత్వం కేవలం ఏడు కరోనా మరణాలే సంభవించినందని మభ్యపెట్టిందని, కానీ, కనీసం 30కి పైగా చనిపోయారని సీతక్క ఆరోపించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం 6 తర్వాత ఎక్కడా దహన సంస్కారాలు చేయరని గుర్తు చేశారు. మరి ఆ సమయంలో శవాలను కాల్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్న లేవనెత్తుతూ ఎమ్మెల్యే సీతక్క ఈ వీడియోను పోస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Must Read: డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్ భార్య.. పత్రాలు అందజేసిన సీఎం.. పోస్టింగ్‌పై కీలక ఆదేశాలు

‘‘సార్.. ఇప్పటివరకు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు చాలు, కనీసం కరోనా విషయంలో నిజాలు చెప్పండి. అప్పుడు ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉంటారు. జులై 21న కేవలం ఏడు కరోనా మరణాలు అని గవర్నమెంట్ తెలియజేసింది. కానీ ఆ ఒక్క రోజే కనీసం 30 పైగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన శవాలను హైదరాబాద్‌లోని ఈఎస్ఐ శ్మశాన వాటికలో దహనం చేస్తున్న దృశ్యాలు చూడండి. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత దహన సంస్కారాలు చేయరు.’’ అని సీతక్క ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన అధికారిక ట్విటర్ ఖాతాలోనూ సీతక్క ఇదే అంశాన్ని ఆంగ్లంలో ట్వీట్ చేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.