యాప్నగరం

కరోనా పీడ వదిలిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హోమాలు

Telangana Coronavirus: కరోనా మహమ్మారి తెలంగాణను విడిచి పోవాలని, అంతేకాక దేశం సమూలంగా కరోనా రహితం కావాలని వేదపండితులు హోమం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ కూడా హాజరయ్యారు.

Samayam Telugu 8 Apr 2020, 5:55 pm
కరోనా వైరస్ దేశం విడిచి పోవాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోమం చేస్తున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే అయిన శంకర్ నాయక్ జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ఈ హోమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే తన సతీమణితో కలిసి కరోనా నివారణ హోమం, అభిషేకాలు చేస్తుండడం విశేషం. వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి తెలంగాణను విడిచి పోవాలని, అంతేకాక దేశం సమూలంగా కరోనా రహితం కావాలని వేదపండితులు హోమం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ కూడా హాజరయ్యారు.
Samayam Telugu homam


ఇటీవల తిరుమలలో కూడా కరోనా నివారణ కోసం ధన్వంతరి మహాయాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. భయం, ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల వంటివి ప్రబలినప్పుడు తిరుమల శ్రీవారికి శాంతి ఉత్సవాలు చేపడతారు. మూడు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు.

మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మంగళవారానికి 404కు చేరాయి. మంగళవారం ఒక్కరోజే 40 మందికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ఈ రోజు ఏ ఒక్కరూ డిశ్చార్జి కాలేదని వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు మొత్తం 348 మంది ఉన్నారు. మరణాలు ఇప్పటి వరకూ 11గా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.