యాప్నగరం

గచ్చిబౌలి కొవిడ్ ఆస్పత్రి సంగతేంటి.. జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

Telangana Coronavirus: ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతాలలో కూడా కోతలు విధించడం దారుణమని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత‌గా అమ్మకాలు లేకపోవడంతోనే రాబడి తగ్గిపోయిందని.. అందుకే ఉద్యోగుల‌ జీతాల్లో కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు.

Samayam Telugu 30 May 2020, 5:13 pm
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కొండపోచమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ కొవిడ్ నియమ నిబంధ‌న‌లను పాటించలేదని అన్నారు. కనీసం భౌతిక దూరం, మాస్క్ కూడా ధరించకుండా సుదర్శన యాగంలో పాల్గొన్నారని విమ‌ర్శించారు. శ‌నివారం జ‌గిత్యాల‌లోని త‌న నివాసంలో జీవన్ రెడ్డి విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చి కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తామన్న సీఎం.. అక్కడ ఇప్పుడు ఒక్క పేషెంట్‌ను కూడా చేర్చలేదని అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం కొవిడ్ పరీక్షలు ఏ విధంగా చేస్తుందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
Samayam Telugu జీవన్ రెడ్డి
Jeevan Reddy


ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతాలలో కూడా కోతలు విధించడం దారుణమని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత‌గా అమ్మకాలు లేకపోవడంతోనే రాబడి తగ్గిపోయిందని.. అందుకే ఉద్యోగుల‌ జీతాల్లో కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read: రైతులకు శుభవార్త చెప్తా అన్నందుకు సిగ్గుపడాలి.. కేసీఆర్‌పై ఉత్తమ్ ధ్వజంAlso Read: సూర్యాపేటలో విచిత్రం.. ఆకాశంలో అద్భుత దృశ్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.