యాప్నగరం

మరోసారి ఈడీ ఆఫీసుకు కవిత న్యాయవాది.. సెల్‌ఫోన్లలో డేటా సేకరణ!

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది భరతో నేడు మరోసారి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవిత ఇచ్చిన మెుబైల్ ఫోన్లలోని డేటాను సేకరించేందుకు గానూ ఈడీ అధికారులు ఆయన్ను పిలిపించినట్లు తెలిసింది. నిన్న కూడా సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లగా.. డేటాతో పాటు కొన్ని విషయాలపై వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Mar 2023, 4:05 pm
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తరపు న్యాయవాది సోమా భరత్ నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసులో ఆమె ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకోగా.. అందులోని సమాచారాన్ని ఈడీ (ED) అధికారులు సేకరిస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నిన్న లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఫోన్లు తెరిచేందుకు గాను స్వయంగా హాజరు కావటం లేదా ప్రతినిధిని పంపాల్సిందిగా కవితకు రాసిన లేఖలో ఈడీ అధికారులు పేర్కొన్నారు.
Samayam Telugu Delhi Liquor Scam
ఢిల్లీ లిక్కర్ కేసు


దీంతో కవిత తన తరఫున న్యాయవాది సోమా భరత్‌ను నిన్న ఈడీ కార్యాలయానికి పంపింది. మంగళవారం ఉదయం 11.30కు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన భరత్.. సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. సెల్‌ఫోన్లలో డేటాతో పాటు మరికొంత సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. ఇవాళ కూడా రావాలని ఈడీ అధికారులు కోరటంతో భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

ఇక ఈ కేసులో కవితను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు ఆమె ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 20న రెండోసారి హాజరైనపుడు కవిత బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఆధారులు ధ్వసం చేశారని ఈడీ కవితపై అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న విచారణకు హాజరైన సమయంలో కవిత కొన్ని మొబైల్ ఫోన్లను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు ఈడీ తనను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తుందని చెప్పేందుకు వాటిని మీడియాకు చూపించారు. అనంతరం వాటిని ఈడీ అధికారులకు అప్పగించారు. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లలో సమాచారాన్ని ఈడీ సేకరిస్తుంది. డేటా సేకరణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. తనకు ఈడీ సమన్లు జారీ చేయటాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీం కోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేసిన సగంతి తెలిసిందే. ఈ పిటిషన్ ఈనెల 27న విచారణకు రాగా.. పిటిషన్‌పై విచారణను సుప్రీం మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖితపూర్వక వాదనలు వినిపించాలని కవితతో పాటు, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.