యాప్నగరం

MLC Kavitha: నాకు ఏ నోటీసులు రాలేదు.. వాళ్ల టైం వేస్ట్ చేయకండి

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచి.. మరోసారి దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిస ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కవిత.. ఈ వ్యవహారంపై మరోసారి ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ఉన్న కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ.. తీవ్ర విమర్శలు చేశారు. వారి మాటలు నమ్మి ప్రజల విలువైన సమయాన్ని వృథా చేయవద్దని మీడియాను కోరారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 16 Sep 2022, 6:12 pm
MLC Kavitha: దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi liquor scam case) లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా మొత్తం 40 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు.. హైదరాబాద్‌లోని పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి ఘాటుగా స్పందించారు. కుంభకోణంలో ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కవిత.. ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu Kavitha
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత


ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చున్న కొందరే కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఈడీ దూకుడు పెంచి సోదాలు నిర్వహిస్తోన్న తరుణంలో కవిత ట్వీట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

" ఢిల్లీలో కూర్చొని కొందరు చేస్తున్న దుష్ప్రచారం చేస్తూ.. మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారు. నిజాన్ని మాత్రమే జనాలకు చేరవేయాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న. దాని వల్ల వీక్షకుల విలువైన సమయాన్ని కాపాడినవాళ్లవుతారు. నాకు ఎలాంటి నోటీసులు అందలేదని మరోకసారి తెలియజేస్తున్నాను." అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

దిల్లీ లిక్కర్ స్కామ్లో తనకు సంబంధం ఉందని ఆరోపణలు చేసిన పలువురు బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే పరువునష్టం దావా వేశారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్‌ సిర్సాను ఆదేశించింది. సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయొద్దని పేర్కొంటూ పర్వేశ్‌వర్మ, మజుందర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.