యాప్నగరం

రోడ్డుపక్కన పానీపూరీ తిన్న కవిత.. చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ..

GHMC Elections: బీజేపీ ప్రభుత్వం ఆరేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కవిత విమర్శించారు. 2014లో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని మండిపడ్డారు.

Samayam Telugu 26 Nov 2020, 11:04 pm
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న పానీ పూరి బండి దగ్గర ఆగి పానీ పూరి తిన్నారు. అంతేకాకుండా తనతో ఉన్న కార్యకర్తలకు కూడా పానీపూరి తినిపించారు. గాంధీ నగర్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, రోడ్డు పక్కన చిరు వ్యాపారులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలకరించారు. పానీ పూరీ బండి నిర్వహకుడు స్వామితో కవిత ముచ్చటించారు. తాను తన చిన్నప్పుడు సికింద్రాబాద్‌లో పానీపూరీ తిన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Samayam Telugu చాట్ తింటున్న కవిత
kavitha eats pani puri


ప్రచారంలో భాగంగా కవిత మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఆరేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని విమర్శించారు. 2014లో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం అనేక చట్టాలను తెచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో ప్రగతి లోపించిందన్నారు.

చట్ట ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించలేదని అన్నారు. హైదరాబాద్‌లో వరదలొచ్చినప్పుడు కనపడని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఓట్ల కోసం హైదరాబాద్‌ వస్తున్నారని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.