యాప్నగరం

Alai Balai 2021: బండి సంజయ్‌తో కవిత ముచ్చట.! ఫొటో వైరల్

టీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమాని ఆ వైరం మరింత పెరిగింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ మాట్లాడుకుంటున్న ఫొటో వైరల్ అవుతోంది.

Samayam Telugu 17 Oct 2021, 10:00 pm
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే అలయ్ బలయ్‌ ఈ రోజు జలవిహార్‌లో ఘనంగా జరిగింది. వివిధ రంగాల ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌తో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముచ్చటిస్తూ కనిపించారు. రాజకీయ ప్రత్యర్థులైన టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ముచ్చటిస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడితే సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటో తెగవైరలవుతోంది.
Samayam Telugu బండి సంజయ్‌తో మాట్లాడుతున్న కవిత
kavitha


దసరా ఉత్సవాల సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు బండారు దత్తాత్రేయ. ఆయన గవర్నర్‌గా ఉండడంతో ఈసారి కార్యక్రమాన్ని దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, ప్రముఖ వైద్యులు నాగేశ్వర్ రెడ్డి, సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్, మంచు విష్ణు తదితరులు హాజరయ్యారు.

అలయ్ బలయ్‌లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడూ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలతో విరుచుకుపడే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. సీఎం కుమార్తె కవిత ముచ్చటించుకోవడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. అటు సినీ రంగం నుంచి హాజరైన ప్రముఖులు పవన్ కళ్యాణ్, మంచు విష్ణు మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచు విష్ణుని కనీసం పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.