యాప్నగరం

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిని పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న ఆయనను కవిత ఇవాళ వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Samayam Telugu 31 Jan 2021, 11:53 am
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో దవాఖానలో చికిత్స పొంతుదున్న ఆయనను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు.
Samayam Telugu రాజాను పరామర్శిస్తున్న కవిత


సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభయయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా నిన్న ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రసుత్తం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని, వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.