యాప్నగరం

పెళ్లికి డబ్బులేదని.. కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

పెద్దకూతురుకు పెళ్లి నిశ్చయించారు. వచ్చే నెలే పెళ్లి. అయితే చేతిలో చిల్లిగవ్వలేదు. రేపే మాపో పెళ్లివారు కూడా ఇంటికి వస్తారని సమాచారం అందింది. దీంతో ఏం చేయాలో తోచక.. ప్రాణం తీసుకున్నారు.

Samayam Telugu 10 Dec 2020, 9:12 am
కూతురు పెళ్లికి సమయం దగ్గర పడింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఇంటికి బంధువులు వస్తారని సమాచారం అందింది. దీంతో ఏం చేయాలో తెలియలేదు. ఇక చావే శరణ్యమనుకున్నారు. తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని మూడో పట్టణ ప్రాంథానికి చెందిన గోవిందమ్మ , ఆమె కూతుళ్లు రాధిక , రమ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Samayam Telugu తల్లి కూతుళ్ల ఆత్మహత్య
mother and daughter suicide


Read More: KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం... మోదీ అపాయింట్‌మెంట్ కోరిన కేసీఆర్

ఖమ్మం నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో ఓ కుటుంబంలో నివాసం ఉంటుంది.కటిక పేదరికం . ఇద్దరు కూతుళ్లు పెళ్లీడుకు వచ్చారు. పెద్ద కూతురు వివాహం జనగామకు చెందిన అబ్బాయితో పెద్దలు నిశ్చయించారు. ఈనెల జనవరి 11న వివాహం జరగనుంది. తండ్రి ప్రకాష్ బంగారం షాపులో పని చేస్తుండగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు టైలారింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కట్నం లేకుండా వివాహానికి సిద్ధం అయ్యారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు పుట్టని పరిస్థితి నెలకొంది.

వివాహం దగ్గర పడటం, డబ్బులు లేకపోవడంతో కలతచెందారు.. బుధవారం రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి.. తల్లి గోవిందమ్మ (49), కూతుళ్లు రాధిక(29), రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చే సరికి ఇంట్లో అంతా మృతిచెంది ఉండడంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పెళ్లి జరగాల్సిన ఉంట్లో.. ఇలా తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.