యాప్నగరం

పిల్లల్ని కాపాడి ప్రాణాలు వదిలిన తల్లి

ఐదుగురు పిల్లలతో కలిసి పత్లి చేనుకు వెళ్లారు.పని ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి బయల్దేరారు. ఇంతలో భారీ వర్షం కురిసింది. వాగు పొంగి పొర్లింది.

Samayam Telugu 17 Sep 2020, 8:47 am
కడుపున పుట్టిన బిడ్డల కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టింది ఓ తల్లి. ఈ విషాదకరమైన ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మంల పరిధి షాపూర్ తండా సమీపంలో జరిగింది. వాగులో చిక్కుకున్న తన పిల్లల్ని కాపాడిన తల్లి మాత్రం అదేవాగులో కొట్టుకుపోయి ప్రాణ త్యాగం చేసింది. తండాకు చెందిన దశరథ్‌, అనితాబాయి(35) దంపతులకు ఐదుగురు పిల్లలు. వ్యవసాయం కుటుంబం కావడంతో పత్తి చేనులో కలుపు తీసేందుకు ఇంటిల్లిపాదితోపాటు మరో ముగ్గురు అటోలో వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటికి తిరిగి పయనమయ్యాకు. ఇంతలో భారీ వర్షం పడింది. మార్గం మధ్యలో ఉండే వాగుకు వరద ప్రవాహం పెరిగింది.
Samayam Telugu పిల్లల్నికాపాడి తల్లి మృతి
mother drown to death


Read More: భార్యపై అభాండాలు వేశారని.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఇంటికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. దీంతో దంపతులు ముందుగా తమ ముగ్గురు పిల్లలను అతి కష్టంమ్మీద క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. రెండో సారి పదకొండు, పద్నాలుగేళ్ల కుమార్తెలు బబ్లూ బాయి, వీణాబాయిలను వాగు దాటిస్తుండగా తల్లి కాలు పట్టుతప్పింది. ఈ క్రమంలో ఆమె, ఆమె చేతులు పట్టుకుని ఉన్న పిల్లలు వాగులో కొట్టుపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఆమె కుమార్తెలను కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫలమైంది.

వీరంతా మరో వైపునకు దూసుకెళ్లారు. అక్కడే ఉన్న భర్త అతి కష్టమ్మీద పిల్లలిద్దర్నీ కాపాడాడు. అయితే భార్య మాత్రం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. కాసేపటికి అనితాబాయి మృతదేహం 200 మీటర్ల దూరంలో లభ్యమైంది. స్థానికులు తాడు సాయంతో మిగిలిన వారిని వాగు దాటించారు. తల్లి తమ కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.