యాప్నగరం

హైదరాబాద్: కూతురి మరణంతో ఆవేదన.. బిల్డింగ్‌పై నుంచి దూకి తల్లి ఆత్మహత్య

రెండు రోజుల క్రితమే కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి. సికింద్రాబాద్ చిలకలగూడలో ఘటన.

Samayam Telugu 7 Nov 2019, 2:48 pm
సికింద్రాబాద్‌ చిలకలగూడాలో దారుణం జరగింది. కూతురు చనిపోయిందన్న బాధతో తల్లి కూడా ఆత్మహత్య చేసకుంది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. చిలకలగూడకు చెందిన మంజులకు కుమార్తెత కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. అయితే కూతురు మానస చిన్నప్పటి నుంచి ఆస్తమా వ్యాధితో బాధపడుతుండగా.. ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం కుదుటపడలేదు.
Samayam Telugu mother suicide after daughters death depression in secunderabad
హైదరాబాద్: కూతురి మరణంతో ఆవేదన.. బిల్డింగ్‌పై నుంచి దూకి తల్లి ఆత్మహత్య


మానస ఆస్తమాతో బాధపడుతూ రెండు రోజుల క్రితం చనిపోగా.. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు చనిపోవడంతో.. మంజుల దిగులు పెంచుకుంది. తన బిడ్డ ఇక లేదనే చేదు నిజాన్ని మర్చిపోలేకపోయింది. మానసనే తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. బంధువులు ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం ఆ బాధను దిగమింగుకోలేకపోయింది.

తన కూతురు లేదన్న బాధలో మంజుల ప్రాణాలు తీసుకోవాలని భావించింది. వెంటనే నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పైకి ఎక్కి కిందకు దూకేసింది. దీంతో ఆమె అక్కడి నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. ఒకు కుటుంబంలో తల్లీకూతుళ్లు చనిపోవడంతో స్థానికంగా విషాద వాతావరణం కనిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.