యాప్నగరం

ఇలాంటి సీఎం ఉండడం దౌర్భాగ్యం.. లాక్‌డౌన్‌ తీరుపై ఎంపీ అర్వింద్ గరం

Lockdown in Nizamabad: రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించిన నిజామాబాద్‌లోని ఆటో నగర్‌లో ఓ కుటుంబాన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగా నిజామాబాద్ డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారని, అతణ్ని ఎందుకు అరెస్ట్‌ చేయబోరని అన్నారు.

Samayam Telugu 18 Apr 2020, 11:32 pm
నిజామాబాద్ పోలీసులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. తోపుడు బండ్లపై పళ్ల వ్యాపారం చేసుకొనే కొంత మంది హిందువులను పోలీసులు వెళ్లగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళ బొమ్మలు తీసేయాలని బెదిరిస్తున్నారని.. ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఎంఐఎం నేత, నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్‌పై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అతణ్ని కనీసం హౌస్ అరెస్ట్ కూడా చేయలేదని, దీంతో ఆయన రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు.
Samayam Telugu Dharmapuri Arvind


Also Read: undefined

రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించిన నిజామాబాద్‌లోని ఆటో నగర్‌లో ఓ కుటుంబాన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగా నిజామాబాద్ డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారని, అతణ్ని ఎందుకు అరెస్ట్‌ చేయబోరని అన్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అతణ్ని అరెస్ట్‌ చేసినట్టుగా పైకి చెబుతున్నా ఎఫ్‌ఐఆర్‌ వివరాలు మాత్రం వెల్లడించడం లేదని అన్నారు. ఇంతకు ముందు కూడా ఎంఐఎం నేతలు వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని గుర్తు చేశారు. వారి స్వభావంతో రాష్ట్రంలో కరోనా వ్యాధి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read: undefined

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను ప్రధాని స్థాయిలో ఊహించుకుంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ చెప్పినట్లే ప్రధాని నడుచుకుంటున్నట్లు సీఎం ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వివేకం, వివేచన లేని ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం మన దౌర్భాగ్యమని ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ నగరం హాట్ స్పాట్‌గా ఉందని గుర్తు చేసిన ఆయన.. ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని హెచ్చరించారు.

Also Read: లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగుల్ని తొలగించొద్దు.. ఐటీ కంపెనీలకు కేటీఆర్ విజ్ఞప్తి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.