యాప్నగరం

లాక్‌డౌన్ పొడిగిస్తే ఈ పనులు చేయండి.. మోదీకి ఒవైసీ ట్వీట్

Lockdown Extension: తాజాగా లాక్ డౌన్ పొడగింపుపై హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. శనివారం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

Samayam Telugu 11 Apr 2020, 1:39 pm
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రస్తుతం విధిస్తున్న లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తొలుత విధించిన 21 రోజుల లాక్ డౌన్ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఇంకా కొవిడ్ కేసులు పెరుగుతుండడం, చనిపోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా గతంలో లాక్ డౌన్ పొడిగింపునకు అనుకూలంగానే మాట్లాడారు.
Samayam Telugu Asaduddin spe1.


అయితే, తాజాగా లాక్ డౌన్ పొడగింపుపై హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. శనివారం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఎటువంటి ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు, రోజు కూలీలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఒకవేళ లాక్‌ డౌన్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకుంటే, మొదట తాను సూచించిన చర్యలు అమలు చేసి తర్వాత లాక్ డౌన్ పొడగించుకోవచ్చని సూచించారు.

ప్రతి వలస కార్మికుడు లేదా రోజు కూలీకి రూ.5 వేలు, ఆకలితో అలమటించే వారికి సరిపడా నిత్యావసరాలు, వలస కూలీలు, నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ర్టాలకు తగినన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసద్ సూచించారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌లో వందలాది వలస కార్మికులు రోడ్డుపైకి వచ్చి స్వస్థలాలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న వీడియోను కూడా ట్వీట్ చేశారు. ముందు ప్రజల బతుకు ముఖ్యమని, ఆర్థిక వ్యవస్థ తర్వాతి విషయమని అభిప్రాయపడ్డారు.

Must Read: రామ్ గోపాల్ వర్మకు మంత్రి కేటీఆర్ అదిరే పంచ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.