యాప్నగరం

ఆ విషయంలో కేసీఆర్ కన్నా కిరణ్ కుమార్ రెడ్డే నయం: ఎంపీ

PV Ghat: పీవీ నరసింహారావు మీద సీఎం కేసీఆర్ దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని అర్వింద్ విమర్శించారు. ఈయనకన్నా నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నయమని.. ఒకరిని జైల్లో పెట్టించారని ఎంఐఎం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Samayam Telugu 23 Dec 2020, 3:15 pm
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడే ఉన్న విలేకరులతో అర్వింద్ మాట్లాడుతూ.. పీవీ తనను రాజకీయాలలోకి రావొద్దని సూచించారని గుర్తు చేసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పీవీ ఘాట్‌ను కూలకొడతామని పాతబస్తీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్న విషయాన్ని కూడా సీఎం గుర్తు చేశారు. అయినా సీఎం ఒక్క మాట కూడామాట్లాడలేదని విమర్శించారు.
Samayam Telugu ధర్మపురి అర్వింద్
Dharmapuri Arvind


పీవీ నరసింహారావు మీద సీఎం కేసీఆర్ దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని అర్వింద్ విమర్శించారు. ఈయనకన్నా నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నయమని.. ఒకరిని జైల్లో పెట్టించారని ఎంఐఎం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతామని తెలిపారు. పీవీ నరసింహారావును చూసి భారతీయత నేర్చుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు.

‘‘పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. 1999లో పీవీని కలిసినప్పుడు మీనాన్నలాగా నువ్వు కూడా రాజకీయాల్లోకి రావొద్దని సూచించారు. భారతీయత అనే గర్వం ఆయనలో చనిపోయే వరకు ఉండేది.’’ అని గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.