యాప్నగరం

ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డి.. విచారణ వాయిదా

Hyderabad: ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న వారంతా మంగళవారం ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

Samayam Telugu 3 Mar 2020, 2:50 pm
ఐదేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా మంగళవారం ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
Samayam Telugu revanth_01547025228


Also Read: కరోనా లక్షణాలతో మరో ముగ్గురు.. అపోలో సిబ్బంది కూడా గాంధీకి తరలింపు

2015లో ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలల పాటు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పుడే ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి.

Also Read: హైదరాబాద్: కరోనాపై మంత్రుల రివ్యూ.. అలా చేస్తే కఠిన చర్యలు

2015లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కారు.

Must Read: హైదరాబాద్: కరోనా సోకిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో పరీక్షలు ఎందుకు చేయలేదంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.