యాప్నగరం

NGTలో రేవంత్ రెడ్డి పిటిషన్.. ఆ బడా నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ

Malkajgiri MP: ఆర్థిక, రాజకీయ బలం ఉన్న కొన్ని నిర్మాణ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని రేవంత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి భారీ కట్టడాలు చేశాయని ఆరోపించారు.

Samayam Telugu 30 Sep 2020, 6:41 pm
హైదరాబాద్‌లోని పుప్పాల గూడలో నాలాలను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జీవో 111 సహా భవన నిర్మాణాల నిబంధనలు 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని ఆరోపిస్తూ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు.
Samayam Telugu రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Revanth Reddy smile


ఆర్థిక, రాజకీయ బలం ఉన్న డీఎల్ఎఫ్, మై హోం వంటి సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని రేవంత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ పరిశీలించిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సహా డీఎల్ఎఫ్, మైహోమ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ రీజినల్ ఆఫీసర్, చెరువుల పరిరక్షణ కమిటీలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వచ్చే రెండు నెలల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.