యాప్నగరం

Ajay Devganకు థ్యాంక్స్ చెప్పిన ఎంపీ సంతోష్, ఎంత మార్పు.. అదిరిపోయే పాటతో ట్వీట్ వైరల్

Dandumailaram Industrial Park: రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవ్‌‌గణ్ ఆరు నెలల క్రితం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అజయ్ దేవ్‌‌గణ్ NY Foundation ను స్థాపించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 10 Jun 2021, 7:04 pm
Green India Challenge: ప్రకృతి, పర్యావరణం పట్ల మక్కువతో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. గత ఆర్నెల్ల క్రితం బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సౌజన్యంతో నాటిన మొక్కలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో వివరిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇందుకోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై చక్కని ఓ పాట రాయించారు. ఆ పాట ఎంతో స్ఫూర్తిమంతంగా ఉండడం విశేషం. ఆ ట్వీట్‌కు అజయ్ దేవ్‌గణ్‌ను ట్యాగ్ చేశారు. కాసేపటికి ఈ ట్వీట్‌ను అజయ్ దేవ్‌గణ్ రీట్వీట్ చేశారు.
Samayam Telugu ఎంపీ సంతోష్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ (ఫైల్ ఫోటోలు)
mp santhosh ajay devgan


రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవ్‌‌గణ్ ఆరు నెలల క్రితం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అజయ్ దేవ్‌‌గణ్ NY Foundation ను స్థాపించిన విషయం తెలిసిందే. తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేస్తూ అజయ్ దేవ్‌‌గణ్ దండుమైలారం ఇండస్ట్రియల్ పార్కులో ఈ మొక్కలు నాటారు.

బైక్‌ నడుపుతూ యువకుల వింత భంగిమ.. ఒక్క క్లిక్‌తో ఏకంగా 6 చలాన్లు, మైండ్ బ్లోయింగ్ ఫోటో
ఇప్పుడు ఆ మొక్కలు పెద్దయి పువ్వులు పూస్తూ, ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఎంపీ సంతోశ్ కుమార్ తన ట్వీట్‌లో తెలిపారు. ట్విటర్ ద్వారా అజయ్ దేవ్‌‌గణ్‌కు సంతోశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.