యాప్నగరం

TRS @20: కేసీఆర్ కూపన్స్ ఆవిష్కరించిన ఎంపీ సంతోశ్

TRS NRI wing: ‘కేసీఆర్ కూపన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపారు.

Samayam Telugu 27 Apr 2020, 10:03 am
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేసీఆర్ స్పూర్తి, కేటీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల యూకే నుంచి వచ్చి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రవాస విద్యార్థులకు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి.. సామాజిక దూరాన్ని పాటిస్తూ, నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేయడానికి రూపొందించిన ‘కేసీఆర్ కూపన్స్’ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించి ప్రారంభించారు.
Samayam Telugu 19a62041-ceb0-43ce-97bf-64607ca0428c


‘కేసీఆర్ కూపన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం (ఏప్రిల్ 27) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఎలాంటి ఉత్సవాలకూ, ఆర్భాటాలకు పోవద్దని పార్టీ కార్య నిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. కార్యకర్తలంతా తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన రక్తదానం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.