యాప్నగరం

వేటగాళ్ల వల.. యువ ఎంపీటీసీ బలి, మంచిర్యాలలో విషాదం

Mancherial జిల్లాలో విషాదం జరిగింది. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఓ ఎంపీటీసీ మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Samayam Telugu 27 Jan 2020, 12:01 pm
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ యువ ఎంపీటీసీ బలయ్యాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం, మామిడిగట్టులో ఈ విషాదం చోటు చేసుకుంది. అడవి పందులు, కుందేళ్ల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు ప్రమాదవశాత్తూ తగిలి ఎంపిటీసీ ఆసిఫ్‌ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి అతడు ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నాడు. సోమవారం (జనవరి 27) ఉదయం పొలానికి వెళ్తుండగా.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు బలయ్యాడు. దీంతో ఆసిఫ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Samayam Telugu death
నమూనా చిత్రం


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఆసిఫ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్‌ తీగలు అమర్చిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.

చిన్న వయసులోని రాజకీయాల్లోకి వచ్చి ఎంపీటీసీగా ఎన్నికై ఆసిఫ్ మంచి గుర్తింపు సాధించాడని చిర్రగుంట గ్రామస్థులు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో అతడు అకాల మరణం చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫ్‌ మంచి కుర్రాడనీ, అతడికి రాజకీయాల్లో మంచి భవిష్యత్‌ ఉండేదని వారు అన్నారు. ఆసిఫ్ మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Also Read: సరిలేరు నీకెవ్వరా.. దంచి కొడితేనే దారిలోకి వస్తారు, మీడియాపై రేవంత్ ఫైర్

Must Read: నిజామాబాద్‌లో వీడిన ఉత్కంఠ.. మేయర్ పీఠం ఆ పార్టీకే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.