యాప్నగరం

మిస్ ఇండియా తెలంగాణగా భాగ్యనగర వైద్యురాలు

Mrs India Telangana 2019 కిరీటాన్ని 63 ఏళ్ల ఓ వైద్యురాలు ఎంపికయ్యారు. డాక్టర్‌గా తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఫ్యాషన్ రంగంపై మమకారంతో శోభాదేవి పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు.

Samayam Telugu 8 Nov 2019, 7:56 pm
డాక్టర్‌గా రాణిస్తూనే 63 ఏళ్ల ఓ మహిళ ఫ్యాషన్‌ రంగంలోనూ సత్తా చాటారు. మిసెస్ ఇండియా తెలంగాణ 2019 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని లైఫ్‌ స్పాన్‌ ఆస్పత్రిలో డయాబెటాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్‌ నక్కాన శోభాదేవి ఈ ఘనత సాధించారు. ఆమెపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Samayam Telugu mrs
మిసెస్ ఇండియా తెలంగాణ


లండన్‌లో 20 ఏళ్లు డాక్టర్‌గా పని చేసిన శోభాదేవి.. స్వదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో భారత్‌కు తిరిగొచ్చారు. వైద్య రంగంలో సేవలకు గాను ఆమె పలు అవార్డులు పొందారు. డాక్టర్‌గా తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. ఫ్యాషన్‌ రంగం మీద మక్కువతో పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. తాజాగా మిసెన్‌ ఇండియా తెలంగాణ 2019 అందాల పోటీలో విజేతగా నిలిచారు.

సూపర్‌ క్లాసిక్‌ విభాగంలో శోభాదేవి కిరీటం దక్కించుకున్నారు. ఈ అవార్డు దక్కడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఈ మేరకు ‘ఈనాడు’ ఓ కథనం ప్రచురించింది.

Photo Credit: Facebook - Mrs India Telangana

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.