యాప్నగరం

పాతబస్తీలో మొహరం ఊరేగింపు.. భద్రత పెంచిన పోలీసులు

మొహరం పండగ కాదు అమరవీరు త్యాగాలకు ప్రతీక. ప్రతీ ఏటా మొహరం నెలలో కొన్నిరోజులను సంతాప దినాలుగా ముస్లీం సోదరులు పాటిస్తారు. కొత్త వస్తువులు వాడటం, కొత్త బట్టలు ధరించడం చేయరు.

Samayam Telugu 30 Aug 2020, 2:45 pm
హైదరాబాద్ లోని పాతబస్తీలో మొహరం ఊరేగింపు కొనసాగించారు. రేపు మొహరం పండుగ సందర్భంగా పాతబస్తీ సందడి సందడిగా మారింది. డబిర్పుర నుండి బిబి కా అలం సియ మత పెద్దలు ఊరేగింపు నిర్వహించారు. మొహరం సంతాప దినాలు సందర్భంగా షియా ముస్లింలు రక్తాన్ని సమర్పించారు. మొహరం పండుగ సందర్భంగా సందడిగా ఉన్న పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
Samayam Telugu మొహరం
muhurram


‘మొహరం’ పండగ కాదు... అమరవీరుల త్యాగాలను స్మరించడం. ఇస్లాం కోసం అనేకమంది ముస్లీంలు ప్రాణాల్ని త్యాగం చేశారు.
ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు.

ఎట్టి పరిస్థితిల్లోనూ ఇస్లాం సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని అని యాజిద్ బలవంతం వారిని బలవంతం జాలీ, కరుణ, కనికరం లేకుండా అత్యంత హేయంగా ఇమామ్ హుస్సేన్ కుటుంబసభ్యులను శత్రు సైన్యం ఇరాక్ లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు. 2 ఏళ్ల చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు.మొహారం నెల 10 వరోజు హాజరత్ ఇమాం హుసైన్ సైతం వీర మరణం పొందారు. ఈ త్యాగనిరతికి ప్రపంచం ఆశ్చర్య పోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.