యాప్నగరం

కేసీఆర్ ఆ ప్రకటన చేయడం సిగ్గుచేటు.. ఎమ్మెల్యే సీతక్క ధ్వజం

Telangana Lockdown: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా హస్పిటల్ కమిటీ నియాయకమంలో తేడాలు జరిగాయని సీతక్క ఆరోపించారు. ఈ జిల్లా అభివృద్ధి కమిటీ‌లో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Samayam Telugu 22 May 2020, 3:58 pm
ప్రభుత్వం చెప్పిన చెప్పిన పంటలు వేసిన వారికే రైతు బంధు పథకం వర్తింపు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేట‌ని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీత‌క్క విమర్శించారు. తెలంగాణలో రైతులు పరిస్థితి దారుణంగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌‌లో శుక్రవారం ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రైతులు సాగు చేసుకుంటన్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.
Samayam Telugu సీతక్క
Seethakka


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా హస్పిటల్ కమిటీ నియాయకమంలో తేడాలు జరిగాయని సీతక్క ఆరోపించారు. ఈ జిల్లా అభివృద్ధి కమిటీ‌లో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. జిల్లా అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయొద్దని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులకు ప్రోటో కాల్ ప్రకారం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు.

తెలంగాణలో పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవని విమర్శించారు. కొంత మంది పేదలకు ఇంతవరకు రేషన్ కార్డే ఇవ్వలేదని విమర్శించారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లాలో ఉన్న గిరిజన ప్రజలకు ఒక్కో ఇంటికి 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైన్ షాపులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ద.. పేద ప్రజల ఆకలిపై లేదని సీతక్క విమర్శించారు. మాస్క్‌లు ధరించడంపై ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని, కానీ ఇంతవరకు మాస్క్‌ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.