Mulugu Mla Seethakka Distributing Rice And Vegitables To The Poor During Lockdown
శభాష్ సీతక్క.. ఒకప్పుడు తుపాకీ పట్టిన చేతితో.. ప్రజల కోసం నిత్యావసరాలు..
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. రోజుల తరబడి పనులు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు బియ్యం, కొంత నగదు సాయం చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి ప్రజలకు సాయం చేస్తున్నారు. బియ్యం, కూరగాయలు లాంటి నిత్యావసరాలను పేదలకు అందజేస్తూ.. వారికి కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. కేసీఆర్ పిలుపుతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పేదలను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. కానీ ఎక్కువగా రోడ్ల వెంబడి ఉన్న ప్రాంతాలకే వీరి సాయం పరిమితం అవుతుందనే విమర్శులున్నాయి. కానీ ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం అడవుల్లో తిరుగుతూ, వాగులు వంకలు దాటుతూ.. మారుమూల పల్లెల్లోని గిరిజన బిడ్డలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఒకప్పుడు నా చేతిలో తుపాకీ ఉండేది, ఇప్పుడు బియ్యం, కూరగాయలు ఉంటున్నాయని ఆమె ఆనందంగా చెబుతున్నారు.
Samayam Telugu15 Apr 2020, 5:36 pm
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. రోజుల తరబడి పనులు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు బియ్యం, కొంత నగదు సాయం చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి ప్రజలకు సాయం చేస్తున్నారు. బియ్యం, కూరగాయలు లాంటి నిత్యావసరాలను పేదలకు అందజేస్తూ.. వారికి కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. కేసీఆర్ పిలుపుతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పేదలను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. కానీ ఎక్కువగా రోడ్ల వెంబడి ఉన్న ప్రాంతాలకే వీరి సాయం పరిమితం అవుతుందనే విమర్శులున్నాయి. కానీ ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం అడవుల్లో తిరుగుతూ, వాగులు వంకలు దాటుతూ.. మారుమూల పల్లెల్లోని గిరిజన బిడ్డలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఒకప్పుడు నా చేతిలో తుపాకీ ఉండేది, ఇప్పుడు బియ్యం, కూరగాయలు ఉంటున్నాయని ఆమె ఆనందంగా చెబుతున్నారు.
ఎక్కడి జనం అక్కడే..
ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఏటూరునాగారం, పస్రా ప్రాంతాలకు చెందిన వారు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. కిరాణా షాపులు నిర్వహిస్తున్న వీరికి కరోనా పాజిటివ్ రావడంతో బాధితుల కుటుంబ సభ్యులను, వారితో దగ్గరగా మెలిగిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ములుగు జిల్లాను నో మూవ్మెంట్ జోన్గా ప్రకటించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలకు నిత్యావసర సరుకులు లభ్యం కావడం లేదు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వారికి ఎమ్మెల్యే సీతక్క అండగా నిలుస్తున్నారు. Image Source: Twitter
320 గ్రామాలు, గూడేల్లో పంపిణీ పూర్తి
ములుగు నియోజకవర్గంలోని 700కుపైగా పల్లెలు ఉంటే.. 320 గ్రామాల్లో బియ్యం, కూరగాయలను సీతక్క పంపిణీ చేశారు. ఎడ్ల బండి మీద, ట్రాక్టర్ మీద వెళ్తూ.. కుదరకపోతే యువతతో కలిసి భుజాల మీద మోస్తూ.. మారుమూల ప్రాంత ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఇంకా సగానికి పైగా గ్రామాలకు పంపిణీ చేయాల్సి ఉందని.. మాకు మద్దతుగా నిలవండని సీతక్క కోరుతున్నారు. ఈ క్రమంలో యువత తనకెంతోగానో సాయం చేస్తోందని.. వారు తనతో కలిసి రోజుకు 12 కి.మీ. నడుస్తున్నారని.. బియ్య మూటలను భుజాలపై మోస్తున్నారని ఆమె కొనియాడారు. Image: Twitter
ఆకలి తీరుస్తున్న గ్రామస్థులు
నిత్యావసరాలు పంపిణీ చేయడమే కాదు.. కరోనా బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై కూడా ఆమె గిరిజనులకు సలహాలు ఇస్తున్నారు. పంట చేలల్లో పని చేసే కూలీల దగ్గరకెళ్లి సోషల్ డిస్టెన్సింగ్ గురించి చెబుతున్నారు. తమ కోసం ఎమ్మెల్యే పడుతున్న తపన చూసి గ్రామాలకు వెళ్లినప్పుడు కొందరు అడిగి మరీ ఆమె ఆకలి తీరుస్తున్నారు. ప్రజల కోసం ఆమె పడుతున్న కష్టానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా కూడా ఆమె పడుతున్న కష్టం, తాపత్రయాన్ని గురించి కథనాలను ప్రసారం చేస్తోంది. దీంతో ‘రాష్ట్రంలో మిగతా ప్రజాప్రతినిధులు సీతక్కలా ఎందుకు కష్ట పడటం లేదు?’ కొందరు నెటిజన్లు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. పార్టీలను పక్కనబెట్టి మరీ ఆమె చేస్తున్న పనులను అభినందిస్తున్నారు.
Image: Twitter
తుపాకీని వదిలి రాజకీయాల్లోకి
వాస్తవానికి సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. గతంలో నక్సలైట్గా ఆదివాసీల కోసం పోరాడిన ఆమె పేరు సీతక్కగానే అందరికీ సుపరిచతం. తర్వాత ఉద్యమం నుంచి బయటకొచ్చిన ఆమె టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో ఓడిన ఆమె.. 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికలో చందూలాల్ చేతిలో ఓడారు. తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో రేవంత్రెడ్డి, ఇతర నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమె. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్పై సీతక్క విజయం సాధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను అసెంబ్లీలోనే మాస్కుల గురించి ముందుగా ఆమే హెచ్చరించారు. ఆలిండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆమె కొనసాగుతున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.