యాప్నగరం

తెలంగాణలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

నవంబర్ 13 తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎప్పుడైన నోటిఫికేషన్ వస్తుందన్నారు అధికారులు.దీంతో త్వరలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Samayam Telugu 5 Nov 2020, 12:18 pm
గ్రేటర్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్‌.శంకర్‌, వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌గా జీ శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌గా సత్యబాబు నియమితులయ్యారు.
Samayam Telugu మున్సిపల్ కమిషనర్లు బదిలీ
municipal commissioner transfer


ఇక కొల్లాపూర్‌కు విక్రమసింహారెడ్డి, దేవరకొండకు వెంకటయ్య, భువనగిరికి పూర్ణచందర్‌రావు, జనగామకు సమ్మయ్య, నేరేడుచర్లకు గోపయ్య, తిరుమలగిరికి డీ శ్రీనివాస్‌, జహీరాబాద్‌కు సుభాష్‌రావు, నర్సాపూర్‌కు అశ్రిత్‌కుమార్‌, చేర్యాలకు రాజేంద్ర కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీడీఎంఏ కార్యాలయానికి గీతారాధికను బదిలీ చేసింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

Read More: తెలంగాణలో కరోనా కలకలం.. 1500 దాటుతున్న పాజిటివ్ కేసులు

GHMC ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఈ నెల 13న రానున్నట్లు తెలిపింది. నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని GHMC అధికారులు చెప్పారు. GHMC లో 150 డివిజన్లకు 150 మంది ROలను నియమించినట్టు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 30 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.