యాప్నగరం

హైదరాబాద్‌లో రౌడీషీటర్ల హత్యలు.. కారుతో గుద్ది, కత్తులతో పొడిచి..

Hyderabad Murder: రౌడీ షీటర్లను తొలుత కారుతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో పొడిచి చంపేసి పరారయ్యారు. గుద్దిన కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

Samayam Telugu 6 Jun 2020, 12:48 am
హైదరాబాద్ లంగర్ హౌస్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లపై మరో ముఠాకు చెందిన వారు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు రౌడీ షీటర్లు మృతి చెందారు. వారిని ఛాందీ మహ్మద్, ఫయాదుద్దీన్ అనే రౌడీలుగా గుర్తించారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డవారిని అష్రఫ్ ముఠా సభ్యులుగా గుర్తించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Hyderabad murder


రోడ్డుపై ఉన్న ఛాందీ మహ్మద్, ఫయాదుద్దీన్‌ను తొలుత కారుతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేశారు. మృతులు మహ్మద్, ఫయాదుద్దీన్ గోల్కొండ ప్రాంతవాసులుగా సమాచారం. కత్తులతో పొడిచిన అనంతరం దుండగులు ఘటనాస్థలంలోనే కారును వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం. హత్యల విషయాన్ని తెలుసుకున్న కమిషనర్ అంజనీ కుమార్ ఘటనా స్థలాన్ని హుటాహుటిన పరిశీలించారు. ముగ్గురు నిందితులను తొందర్లోనే పట్టుకుంటామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.