యాప్నగరం

నిర్మల్: అయ్యప్పలకు ముస్లిం యువకుడి అన్నదానం.. అక్కడే భిక్ష

Khanapur అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు ఓ ముస్లిం యువకుడు అన్నదానం చేసి మత సామరస్యాన్ని ఘనంగా చాటాడు. అయ్యప్ప స్వాములు అతడిని నిండు మనసుతో ఆశీర్వదించారు.

Samayam Telugu 17 Dec 2019, 10:38 pm
య్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి మతసామరస్యాన్ని ఘనంగా చాటాడు ఓ ముస్లిం యువకుడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌‌కు చెందిన ఎండీ జమీల్.. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములకు, భక్తులకు మంగళవారం (డిసెంబర్ 17) అన్నదానం చేశాడు. ఈ ఆలయంలో ఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మస్లిం వర్గానికి చెందిన ఓ వ్యక్తి అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నట్లు భక్తులు తెలిపారు.
Samayam Telugu ఖానాపూర్ అయ్యప్ప ఆలయం


నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షా సమయంలో ఏటా నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజూ 150 మందికి పైగా స్వాములు ఇక్కడ భిక్ష చేస్తారు. దానికి కావలసిన సరకులను దాతల నుంచి సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఖానాపూర్‌కు చెందిన ఎండీ జమీల్ అయ్యప్పలకు అన్నదానం చేశాడు.

అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించిన జమీల్.. అనంతరం అతడు కూడా అక్కడే భిక్ష చేశాడు. అయ్యప్ప స్వాములు కూడా మత సమరస్యాన్ని ఘనంగా చాటుతూ అతడికి ఆశీర్వచనాలు ఇచ్చారు. అయ్యప్ప ఆలయంలో గత 30 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని అయ్యప్ప స్వాములు తెలిపారు. మత సామరస్యాన్ని చాటుతున్న ముస్లిం సోదరులకు స్వాములు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఏడాదిలో కేటీఆర్ సాధించింది ఇదే.. అసలు సవాల్ ఇప్పుడే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.