యాప్నగరం

కేసీఆర్ ఓ వజ్రం... నాగబాబు ప్రశంసలు

ఇటీవలి కాలంలో కేసీఆర్ సమావేశాలు చూస్తున్నా, ఆయన ప్రసంగాలు వింటున్నా ఎంతో ఆనందం కలుగుతూ, ఆయనపై అభిమానం పెరిగిందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు.

Samayam Telugu 16 Apr 2020, 10:50 am
దేశంలో అనేకమంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నా.... తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఎంతో స్పెషల్. కేసీఆర్ స్టైలే వేరు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే రకం. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు... మీడియా సైతం ఆయన చెప్పిన ప్రతీ మాటను చాలా ఆసక్తిగా వింటుంది. ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారోనని ఎదురు చూస్తుంది. ఇక కరోనా విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఒకడు ఉంటే చాలని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అందుకే ఇటీవలే సోషల్ మీడియాలో కేసీఆర్ వ్యాఖ్యలు ట్రెండిగ్ అవుతున్నాయి. తాజాగా కేసీఆర్ పై మెగా బ్రదర్ ప్రశంసలు కురిపించారు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
Samayam Telugu kcr nagababu


‘ఇటీవలి కాలంలో కేసీఆర్ సమావేశాలు చూస్తున్నా, ఆయన ప్రసంగాలు వింటున్నా ఎంతో ఆనందం కలుగుతూ, ఆయనపై అభిమానం పెరిగిందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశంలో కేసీఆర్ గారిలాంటి లీడర్స్ వజ్రాల్లా మెరుస్తారు" అని ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే నాగబాబు కామెంట్స్ చూస్తే... ఏ బాధ్యత లేని కొందరు సీఎంలు అని ఆయన పరోక్షంగా జగన్‌పైనే వ్యాఖ్యలు చేశారని పలువురు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇటీవలే బాలీవుడ్ హీరో సోనూసూద్ సూతం కేసీఆర్ తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజల్ని బిడ్డల్లా చూసుకుంటామన్న వ్యాఖ్యలపై స్పందించారు. ట్రూ లీడర్ (నిజమైన నాయకుడు ) అంటూ కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.