తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే వచ్చే ఏడాది మార్చి నెలలో సాగర్ ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు సెప్టెంబరు చివరి వారంలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తిరుపతితో పాటు.. సాగర్కూ ఉప ఎన్నికకు మార్చిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, సాగర్ నియోజకవర్గ శ్రేణులంతా ఎన్నికల మూడ్లోనే ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ జిల్లా నాయకులకు సూచించారు. సాగర్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర నేతల వరుస పర్యటనలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడే సమయానికి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కనీసం రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అధికార పార్టీ నుంచి నోముల కుటుంబానికి, లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ దక్కే అవకాశం ఉందని గులాబీ నేతలు చెబుతున్నారు.
Read More: హైదరాబాద్లో 324 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం
మరోవైపు బీజేపీ కూడా అటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి కోసం పలు పార్టీలకు చెందిన నాయకులతో చర్చలు కూడా జరుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి జానా రెడ్డి కొడుకు ఉప ఎన్నిక బరిలోకి దిగుతారని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ముందుగా జానారెడ్డి పోటీకి దిగుతారని అంతా భావించారు. కానీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు జానారెడ్డి నిరాకరించారు. రెండేళ్ల కాలానికి తాను ఎందుకు పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, సాగర్ నియోజకవర్గ శ్రేణులంతా ఎన్నికల మూడ్లోనే ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ జిల్లా నాయకులకు సూచించారు. సాగర్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర నేతల వరుస పర్యటనలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడే సమయానికి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కనీసం రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అధికార పార్టీ నుంచి నోముల కుటుంబానికి, లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ దక్కే అవకాశం ఉందని గులాబీ నేతలు చెబుతున్నారు.
Read More: హైదరాబాద్లో 324 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం
మరోవైపు బీజేపీ కూడా అటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి కోసం పలు పార్టీలకు చెందిన నాయకులతో చర్చలు కూడా జరుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి జానా రెడ్డి కొడుకు ఉప ఎన్నిక బరిలోకి దిగుతారని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ముందుగా జానారెడ్డి పోటీకి దిగుతారని అంతా భావించారు. కానీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు జానారెడ్డి నిరాకరించారు. రెండేళ్ల కాలానికి తాను ఎందుకు పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది.