యాప్నగరం

నాగార్జునసాగర్ 26 గేట్లు, శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత.. సుందర దృశ్యాలు

Nagarjunasagar dam: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి కూడా వరద తాకిడి పెరగడంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ జల సవ్వడులను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. 4 రోజులు వరుస సెలవులు రావడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌కు క్యూ కట్టారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 12 Aug 2022, 12:28 am
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (Nagarjunasagar Dam) జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 26 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ కిందికి దిగుతూ పరుగులు పెడుతోంది. నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తిన విషయం తెలుసుకొని జలాశయం అందాలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడిచి పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం వరకు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
Samayam Telugu Nagarjunasagar Dam gates open
నాగార్జున సాగర్, శ్రీశైలం గేట్ల ఎత్తివేత


నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 306.39 టీఎంసీల నీరు ఉంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి
మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి (Srisailam Dam) కూడా వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక్కో గేటును 15 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. తద్వారా 50,466 క్యూసెక్కుల వరద నీటిని అదనంగా కిందికి వెళుతోంది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

శ్రీశైలం డ్యామ్


శ్రీశైలం గేట్లు ఎత్తిన విషయం తెలిసి పర్యాటకులు తరలి వస్తున్నారు. జలాశయం దృశ్యాలను చూసేందుకు ఆసక్తి చూపున్నారు. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో శ్రీశైలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన జూరాల, సుంకేసుల జలాశయాలు కూడా జలకళ సంతరించుకున్నాయి. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు.

Also Read:

ఐఐటీ విద్యార్థికి అదిరిపోయే ఉద్యోగం.. రూ.2 కోట్ల ప్యాకేజీ

తాళి కట్టే సమయంలో పెళ్లి ఆపేసిన యువతి.. సినిమా తరహాలో ట్విస్ట్
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.