యాప్నగరం

నాగోబా జాతర రద్దు.. యధావిధిగా మహాపూజలు

కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించే నాగోబా జాతరను రద్దు చేస్తున్నట్లు మెస్రం వంశీయులు ప్రకటించారు. మహా పూజలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.

Samayam Telugu 16 Jan 2021, 9:58 am
అన్ని పండగలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడుతుంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా జరిగే జాతరలు, ఉత్సవాలపై కూడా కోవిడ్ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో నాగోబా జాతరను రద్దు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించే నాగోబా జాతరను రద్దు చేస్తూ మెస్రం వంశీయులు తీర్మానించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయం(మురాడి)లో సమావేశమై పలు తీర్మానాలు చేశారు.
Samayam Telugu నాగోబా జాతర వద్దు


Read More: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక.. జ్వరంతో పాటు కనిపించే లక్షణాలు ఇవే..

ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌పటేల్‌, పెద్దలు చిన్నుపటేల్‌ తీర్మాన వివరాలు వెల్లడించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో కేవలం మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. నాగోబాకు మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతోపాటు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. జాతరతోపాటు ప్రజా దర్బార్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.