యాప్నగరం

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి దోషి.. తేల్చిన కోర్టు

Hajipur case: మూడు కేసుల్లోనూ నేరం నిరూపితమైందని, 11 ఏళ్ల బాలికను ముక్కు మూసి చంపినట్లుగా తేలిందని న్యాయమూర్తి చెప్పగా, మళ్లీ తాను నిరపరాధిననే శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఎలాంటి ఆసరా లేదని నిందితుడు వాపోయాడు.

Samayam Telugu 6 Feb 2020, 4:17 pm
హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని నల్గొండలోని ప్రత్యేక పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. కిక్కిరిసిన కోర్టు హాలులో పోలీసులు నిందితుడిని ప్రవేశపెట్టగా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ముగ్గురు మైనర్లపై హత్యాచార కేసులో నేరం నిరూపితమైందని, ఏమైనా చెప్పుకునేది ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తనకు ఈ హత్యలతో సంబంధం లేదని, అనవసరంగా తన ఇల్లు తగలబెట్టారని శ్రీనివాస్ రెడ్డి రోధిస్తూ చెప్పాడు.
Samayam Telugu Nalgonda_District_Court


మూడు కేసుల్లోనూ నేరం నిరూపితమైందని, 11 ఏళ్ల బాలికను ముక్కు మూసి చంపినట్లుగా తేలిందని న్యాయమూర్తి చెప్పగా, మళ్లీ తాను నిరపరాధిననే శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఎలాంటి ఆసరా లేదని నిందితుడు వాపోయాడు. వారు ప్రస్తుతం ఎక్కడున్నారని జడ్జి ప్రశ్నించగా.. తనకు తెలీదని సమాధానం ఇచ్చాడు.

Also Read: భర్త ప్రాణాల కోసం భార్య భిక్షాటన.. కంటతడి పెట్టించిన ఘటన

2019 ఆగస్టులో జరిగిన బాలిక హత్యాచారం కేసును చేధించగా దోషి శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్ర బయటపడింది. ఇతనిపై మొత్తం నాలుగు హత్య కేసులు, ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసు ఉంది. లిఫ్టు ఇస్తానని చెప్పి బాలికను అపహరించి నిర్మానుష్య ప్రదేశంలో శ్రీనివాస్ రెడ్డి ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. వారికి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేసి అత్యాచారం చేసేవాడని విచారణలో వెల్లడైంది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డి వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. దాదాపు 50 పని దినాలు కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది.

Also Read: కరోనా పరీక్షలు వద్దని ఇంటికి పంపారు.. గాంధీ వైద్యుల నిర్లక్ష్యం?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.