యాప్నగరం

పేట్రేగిపోయిన హ్యాకర్లు.. నల్గొండ ఎస్పీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో వసూళ్ల దందా

Cyber Crime: ఈ విషయం ఎస్పీ రంగనాథ్‌‌కు తెలియడంతో ఆయన స్పందించారు. ఎవరూ తన అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని ప్రకటించారు. రెండు సంవత్సరాలుగా తన ఫేస్‌బుక్ అకౌంట్‌ వాడడం లేదని స్పష్టం చేశారు.

Samayam Telugu 18 Sep 2020, 9:01 pm
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. కొంత కాలం క్రితం దీనికి సామాన్యులే బాధితులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రముఖులు, పోలీసులు సైతం సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. తాజాగా నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌కు సైతం దీని సెగ తగిలింది. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌ను సైబర్ నేరస్తులు హాక్‌ చేశారు. ఎస్పీ పేరుతో పలువురిని డబ్బులు అడిగి ఆయన భార్య అకౌంట్‌కు డబ్బులు పంపాలంటూ పలువురికి మెసేజ్‌లు పంపారు. ఒడిశాకు చెందిన అనిత పేరుతో గూగుల్‌పే, ఫోన్‌పే నెంబర్ పంపించారు. డబ్బులు అకౌంట్లో వేసి స్క్రీన్‌ షాట్‌ పంపాలంటూ పలువురితో ఛాటింగ్‌ చేశారు.
Samayam Telugu నల్గొండ ఎస్పీ
nalgonda sp ranganath


ఈ విషయం ఎస్పీ రంగనాథ్‌‌కు తెలియడంతో ఆయన స్పందించారు. ఎవరూ తన అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని ప్రకటించారు. రెండు సంవత్సరాలుగా తన ఫేస్‌బుక్ అకౌంట్‌ వాడడం లేదని స్పష్టం చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆ ఫేస్‌బుక్ అకౌంట్ తనది కాదని ఎస్పీ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు.

ఎస్పీ రంగనాథ్ ఆవుల పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి, సైబర్ కేటుగాళ్లు డబ్బుల వసూళ్లకు తెగబడ్డారు. తన భార్య అకౌంట్‌కి రూ.20 వేలు పంపాలంటూ ఫేస్‌బుక్‌లోనే మెసేజ్‌లు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాకింగ్‌పై ఎస్పీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.