యాప్నగరం

40 బాంబు పేలుళ్ల సూత్రధారి కరీం కేసులో తుది తీర్పు వాయిదా

Nampalli Court: తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండా కీలక పాత్ర వహించాడు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం.. అందుకు ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 4 Feb 2020, 3:48 pm
1993లో వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా కేసులో నాంపల్లి మంగళవారం విచారణ జరిపింది. అనంతరం ఈ నెల 18కి తుది తీర్పును వాయిదా వేసింది. విచారణ కోసం ప్రస్తుతం ఘజియాబాద్ జైలులో ఉన్న కరీం తుండాను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఇతనిపై లష్కర్-ఏ-తోయిబా తరపున బాంబులు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, దేశంలో దాదాపు 40 పేలుళ్లకు చేసిన ప్రణాళికలో ఈయన హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు.
Samayam Telugu Abdul karim tunda


Also Read: బీటెక్‌లో మూడు కొత్త కోర్సులు.. జేఎన్‌టీయూ ఆమోదం

తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండా కీలక పాత్ర వహించాడు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం.. అందుకు ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుండా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నాడు.

Also Read: ‘‘కేటీఆర్ తెలంగాణ నయా గజినీ’’ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు
Must Read: మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు.. 66 కి.మీ. అడవిలో కాలినడకన

ఇందులో భాగంగా హైదరాబాద్ హుమాయున్ నగర్, సీసీఎస్ వద్ద టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద కూడా చిన్న బాక్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు యత్నించాడు. ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోనూ తుండా బాంబులు పెట్టాడు. తుండాతో పాటు జలిస్ అన్సారీ కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: నేను పూటకొక పార్టీ మార్చే రకం కాదు.. జూపల్లి
Also Read: బాలిక కళ్లలో నుంచి రాళ్లు.. రోజుకు 30 వరకూ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.