యాప్నగరం

NTRకు నందమూరి వారసుల నివాళి

ఎన్టీఆర్‌కు నందమూరి కుటుంబ సభ్యుల ఘన నివాళి. ఘాట్‌‌లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు

Samayam Telugu 18 Jan 2020, 10:07 am
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి. ఎన్టీఆర్ వర్థంతి కావడంతో.. హైదరాబాద్‌లోని ఘాట్‌‌లో వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పుష్పగుఛ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కొద్దిసేపు ఘాట్‌లోనే కూర్చొన్నారు.
Samayam Telugu junior.


ఇటు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఇటు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ర్యాలీ ఏర్పాటు చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పూర చౌరస్తా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.