యాప్నగరం

టీఆర్ఎస్‌లో మరో విషాదం.. పార్టీ నేత ఆకస్మిక మృతి

ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నేతలంతా అనారోగాలతో మరణిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Samayam Telugu 2 Dec 2020, 1:03 pm
టీఆర్ఎస్ పార్టీలో మరో విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట పట్టణ అధ్యక్షుడు, ఉద్యమకారుడు నాయిని నర్సయ్య(55) ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. నర్సంపేటలో ఇంటి వద్ద స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నర్సయ్య మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నర్సయ్య సేవలను కొనియాడారు.
Samayam Telugu టీఆర్ఎస్ నేత మృతి


Read More: దీక్షిత్ రెడ్డి హత్య కేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

ఇప్పటికే తెలంగాణలో పలువురు నాయకులు మరణించారు. నిన్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిచెందారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మికంగామృతి చెందడంతో టీఆర్ఎస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తపేట మార్గదర్శి కాలనీలోని నోముల నివాసానికి చేరుకుని నరసింహ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పి నోముల కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఓదార్చారు. ఇటీవలే మాజీ మంత్రి, స్పీకర్ నాయిని నర్సింహారెడ్డి కూడా మరణించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.