యాప్నగరం

మాజీ మంత్రి నాయిని అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన కేటీఆర్.. వీడియో

Film Nagar: ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నాయిని పాడె మోసి నివాళి అర్పించారు.

Samayam Telugu 22 Oct 2020, 4:59 pm
తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానం శ్మశానంలో ప్రభుత్వ లాంఛనలతో ఈ అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఆత్మీయ నేతకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నాయిని పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
Samayam Telugu పాడె మోస్తున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్
nayini narsimha reddy funeral


కరోనా అనంతరం అనారోగ్యం పాలైన నాయిని నర్సింహరెడ్డి బుధవారం అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.