యాప్నగరం

Dussehra Holidays: దసరా సెలవులు 9 రోజులకు కుదింపు?

Dussehra Holidays: తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే.. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు 14 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రకటించగా.. వాటిని 9 రోజులకు తగ్గించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. వర్షాలు, తదితర కారణాల కారణంగా.. అకాడమిక్ క్యాలెండర్‌లో 8 రోజులు తగ్గటంతో.. వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి రెండు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Sep 2022, 9:40 am
Dussehra Holidays: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఈ పండుగకు విద్యార్థులకు పెద్దఎత్తున సెలవులు వస్తుంటాయి. ఈ ఏడాది అక్టోబర్ 5న విజయదశమి కాగా.. తెలంగాణ ప్రభుత్వం (Telangana) విద్యాసంస్థలకు 14 రోజుల సెలవులు ప్రకటించింది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించగా.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) ప్రతిపాదన పంపించింది. దసరా సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు కుదించాలని సూచిస్తూ.. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు NCERT డైరెక్టర్‌ రాధారెడ్డి లేఖ రాశారు.
Samayam Telugu dussehra
దసరా సెలవులు


రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జూలై 11 నుంచి 16 వరకు వారం రోజులు, జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17న రాష్ట్ర సర్కారు విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. దీంతో అకాడమిక్‌ క్యాలెండర్‌లో మొత్తం పని దినాలు 230 కాగా.. 8 రోజులు తగ్గాయి. ఈ నష్టాన్ని పూరించేందుకు పాఠశాల విద్యాశాఖకు NCERT డైరెక్టర్ రెండు ప్రతిపాదనలు పంపించారు. దసరా సెలవులను 9 రోజులకు కుదించటంతో పాటు.. ఇకమీదట రెండో శనివారం కూడా విద్యాసంస్థలు పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

అందుకోసం.. ఈ నెల 30 వరకు పాఠశాలలు యథావిధిగా నడిపించి.. అక్టోబర్ 1 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని రాధారెడ్డి సూచించారు. ఇదే కాకుండా.. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌తో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లోని రెండో శనివారాల్లోనూ స్కూళ్లు పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని... తద్వారా మరో 5 రోజులు కలిసి వస్తాయని కోరారు. NCERT చేసిన ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఈ ప్రతిపాదనపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో ప్రయాణాలకు అనుగుణంగా రైల్వే, బస్సుల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు తగ్గించాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత చూపిస్తున్నారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.