యాప్నగరం

ఆదరణ కరువై, బతుకు భారమై వృద్ధ జంట ఆత్మహత్య

Jayashankar Bhupalpally జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కొడుకు, కోడలు నిర్లక్ష్యం చేయడంతో ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 18 Jan 2020, 11:57 am
యసు పైబడినా కొడుకు, కోడలు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం (జనవరి 18) ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. చిట్యాల గ్రామానికి చెందిన చెలిమల్ల రాజయ్య (65), లక్ష్మీ (60) అనే దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు సంతానాన్ని పెంచి పెద్ద చేసి వివాహం జరిపించారు.
Samayam Telugu death


వయసు పైబడటంతో రాజయ్య, లక్ష్మీ దంపతులకు బతుకు భారమైంది. కుమారుడు, కోడలు వారి బాగోగులు చూసుకోవడంలేదు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై మనస్తాపంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

వృద్ధ దంపతుల కుమారుడు, కోడల్ని పోలీసులు విచారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. వృద్ధ జంటను నిర్లక్ష్యం చేసిన కొడుకు, కోడలిపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

Also Read: లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ ప్రొఫెసర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.