యాప్నగరం

దారుణం.. అప్పుడే పుట్టిన ఆడపిల్లను కాలువలో పడేశారు

కాలువలో పసికందు మృతదేహం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ పని ఎవరిది అయి ఉంటుందేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 12 Oct 2020, 12:04 pm
ఆడపిల్ల అంటే ఈరోజుకు కూడా తక్కువగానే చూస్తున్నారు. కొంతమంది పుట్టక ముందే కడుపులోనే చిదిమేస్తున్నారు. మరికొందరు పుట్టాక చంపేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని కొందరు దుండగులు కాలువలో పడేశారు. ఈ అమానుషం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో మురికి కాలువలో అప్పుడే పుట్టిన పసికందు కలకలం రేపింది.
Samayam Telugu కాలువలో పసికందు మృతదేహం
new born baby in drainage


Read More: మరో వారంలో పెళ్లి... అంతలోనే యువతి మృతి

కాలువలో పడ్డ పసికందు ఆడపిల్లగా గుర్తించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మురికి కాలువ లో పడేసి పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి తల పడిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల వ్యక్తుల్ని విచారిస్తున్నారు.అంతేకాకుండా ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీల వివరాలు కూడా సేకరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.