తెలంగాణలో 40 వేలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 11 మంది మృతి
Covid Telangana: తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 13,642 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,597 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 2,08,666కు చేరింది.
Samayam Telugu 15 Jul 2020, 10:13 pm
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం మొత్తం 1597 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,342కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,958గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1159 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 25,999 కు చేరింది. ఇక బుధవారం మరో 11 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 386కి చేరింది.
బుధవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 796 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 212 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 115 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో బుధవారం సంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడ 73 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 13,642 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,597 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 2,08,666కు చేరింది. బుధవారం 12,045 ఫలితాలు నెగెటివ్గా తేలాయి.
కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.
బుధవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 796 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 212 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 115 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో బుధవారం సంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడ 73 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 13,642 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,597 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 2,08,666కు చేరింది. బుధవారం 12,045 ఫలితాలు నెగెటివ్గా తేలాయి.
కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.